టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తన కుటుంబం ఇచ్చే ప్రాధాన్యత గురుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాళీ సమయం దొరికితే చాలు కుటుంబం తో నే ఉంటాడు మహేష్. టాలీవుడ్ లో మాములుగా పేజ్3 పార్టీలకు కానీ పుట్టిన రోజు వేడుకలు కు కానీ పెద్దగా పాల్గొనడానికి ఆసక్తి చూపారు మహేష్ . ఈ నేపధ్యంలో ఈరోజు మహేష్ శ్రీమతి నమ్రత 49 వపుట్టినరోజు ని సెలబ్రేట్ చేయాలని ఒక రోజు ముందు గానే దుబాయ్ వెళ్ళేడు మహేష్ .కెరీర్ తొలి రోజుల్లో నే ప్రేమ వివాహం చేసుకున్న మహేష్ నమ్రత కి ఒక బాబు. ఒక పాపా .మహేష్ వారసుడు గౌతమ్ వన్ నేను ఒక్కడే నే సినిమా లో బాల నటుడు గా నటించాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి నమ్రత కి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు మహేష్. ప్రతి రోజు నీతో గడపడం నాకు ప్రత్యేకం. కాని ఈ రోజు మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు.. ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్” అని మహేశ్ ట్వీట్ చేశారు.




Comments are closed.