The South9
The news is by your side.

సినీ పరిశ్రమపై ప్రభుత్వానికి పూర్తి మద్దతు : మంత్రి దుర్గేష్

post top

 

సినీ పరిశ్రమపై ప్రభుత్వానికి పూర్తి మద్దతు : మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం:

సినిమా తీయడం వెనుక వేలాది మంది కృషి ఉంటుందని, వందలాది మంది జీవనాధారం ఈ రంగం మీద ఆధారపడి ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇటీవల రాజమహేంద్రవరం లో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన ఆయన, “సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుమతి ఇస్తోంది. ఒక్క రూపాయి పెరిగితే దానిలో 25 పైసలు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వస్తుంది” అన్నారు.

 

సినిమా షూటింగ్‌లకు తక్షణ అనుమతులు ఇవ్వడమూ, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వివరించారు. తానే సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్ని వర్గాల سینీ ప్రతినిధులతో చర్చించాలంటూ లేఖ రాసినట్టు తెలిపారు.

 

after image

“సినీ రంగంపై విమర్శలు అర్థరహితం”

 

వైసీపీకి చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యలపై మంత్రి దుర్గేష్ మండిపడ్డారు. “వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేయడం సరికాదు. సినిమా విడుదల సమయంలో అసత్య ప్రచారాలు చేయడం, మూర్ఖత్వానికి జంతు సమాన ఉదాహరణ” అని ఘాటు విమర్శలు చేశారు.

 

Post midle

“డీజీపీని అరెస్టులు చేయమని మేమేమీ చెప్పలేదు, కేవలం విచారణ జరపాలని మాత్రమే సూచించాం. అప్పట్లో మీరే బాధ్యత గల మంత్రిగా ఉన్నారా?” అంటూ మాజీ మంత్రిని ప్రశ్నించారు. హరిహర వీరమల్లు సినిమా ప్లాప్ అయ్యిందని అప్పటికే నిర్ణయించడమంటే వేల కుటుంబాల జీవనాధారాన్ని తక్కువగా అంచనా వేయడమేనన్నారు.

 

“సినీ రంగంపై కక్ష కాదు – మద్దతే”

 

ప్రభుత్వానికి సినిమా రంగంపై ఎలాంటి కక్ష లేదని, వ్యతిరేక చర్యలు తీసుకోవడం దూరంగా ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగితే చట్టపరంగా చర్యలు తప్పకుండా ఉంటాయని, కానీ ఎవరూ చనిపోవాలని ఆశించం, రాజకీయ లబ్ధి కోసమే అలా మాట్లాడడం తగదని మంత్రి దుర్గేష్ అన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.