
నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై , వారి పరిపాలన అంశాలపై ట్విట్టర్ వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ పలు ప్రశ్నలు వేస్తుంటారు. తాజాగా స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ఒక లైన్ కోట్ చేస్తూ.. ఏన్….. ఇండిపెండెంట్ లై…. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రధానికి చురకలంటించారు. ప్రధాని మాట్లాడిన మాటల్లోని భావం..”ప్రజల బతుకుల్లో కలుగచేసుకోని ప్రభుత్వం కావాలా మనకు” అనే మాటకి ప్రకాష్ రాజ్ కౌంటర్ గా ఈ ట్వీట్ చేశారు. దేశంలోని బిజెపియేతర పక్షాలు అన్నీ ఏకమయి వారి వ్యక్తిగత స్వేచ్ఛ బంగం కలిగిస్తున్నారని, తమ ఫోన్లు టాప్ చేస్తున్నారే నిరసనల నడుమ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ఈ విధమైనటువంటి కౌంటర్ వేశారు.




Comments are closed.