
సంక్రాంతి దగ్గరికి వస్తుందని ఉత్సాహం ఒకపక్క, కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితి మరోపక్క ఉండడంతో తెలుగు సినిమా పరిశ్రమలోని దర్శకనిర్మాతలకు కునుకు లేకుండా పోతుంది. ముందుగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ RRR వాయిదా పడడంతో అభిమానులు ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం రాధేశ్యాం సంక్రాంతికి విడుదల చేయాలనిమేకర్లు తెలియజేసిన ప్రస్తుతం వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ చేసిన ట్వీట్ వలన సందేహం వస్తుంది. కానీ సంక్రాంతికి రాధేశ్యామ్ ని విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరి ఈ ట్వీట్ అర్థం ఏమిటో దర్శకుడికే తెలియాలి.

సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా – మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి అనే అర్థం వచ్చే విధంగా ట్వీట్ చేశారు



Comments are closed.