తెలుగునాట అల్లు అరవింద్ నేతృత్వంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్న ఆహా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని హోస్ట్గా గా పెట్టి సామ్ జామ్ అనే పేరుతో చిత్ర రంగంలోని ప్రముఖ నటి నటుల అంతరంగాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టి సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్. ఇప్పుడు మరలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆహా. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాప్ బుల్ విత్ ఎన్.బి.కె అనే పేరుతో

ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమయ్యింది అని తెలిపారు ఆహా నిర్వాహకులు అల్లు అరవింద్. వాళ్ళ టీం తో మాట్లాడుతూ బాలకృష్ణతో ప్రోగ్రాం చేస్తే ఎలా ఉంటాది అని అనగానే భారీ స్పందన వచ్చిందని వెంటనే బాలకృష్ణను సంప్రదించి కార్యక్రమ వివరాలు చెప్పామని దానికాయన ఒప్పుకున్నారని అల్లు అరవింద్ అన్నారు. బాలయ్య అభిమానుల తో పాటు అందరినీ అలరించే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



Comments are closed.