పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం “హరిహర వీరమల్లు” ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దోపిడీ దొంగ గా నటిస్తున్నారనే ది ఫిల్మ్ నగర్ సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుంది. మరొక హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ని, ఎంపిక చేసినట్లు సమాచారం. బాలీవుడ్ టాప్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ ని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో చాలా మంది తెలుగు దర్శకులు నర్గీస్ ఫక్రీ ని తెలుగు తెరకు పరిచయం చేయాలని చూసిన రూపుదాల్చి కోలేదు. అయితే ఇప్పుడు పవన్కళ్యాణ్ సరసన నటిస్తూ తెలుగు తెరకు పరిచయం అవుతోంది.





Comments are closed.