The South9
The news is by your side.

సీనియర్ జర్నలిస్ట్  ద సౌత్9 ఎడిటర్  మనపాటి చక్రవర్తికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పరామర్శ

post top

*పత్రికా ప్రకటన*

తేదీ: 04-04-2022,
అమరావతి.

*సీనియర్ జర్నలిస్ట్  ద సౌత్9 ఎడిటర్  మనపాటి చక్రవర్తికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి  పరామర్శ

after image

*ఇటీవల చక్రవర్తికి పితృవియోగం పట్ల ఫోన్ చేసి మాట్లాడిన రాజమోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి*

*బ్రెయిన్ స్ట్రోక్ తో  ప్రముఖ న్యాయవాది మనపాటి సాల్మాన్ దూరమవడం బాధాకరమన్న రాజమోహన్ రెడ్డి*

అమరావతి, ఏప్రిల్, 04; సీనియర్ జర్నలిస్ట్ ద సౌత్9 ఎడిటర్ మనపాటి చక్రవర్తిని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల చక్రవర్తి తండ్రి, ప్రముఖ న్యాయవాది నెల్లూరుకు చెందిన మనపాటి సాల్మాన్ మృతి చెందిన వార్త విని కుటుంబ సభ్యులకు ఆయన సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు. అనారోగ్యం కారణంగా సాల్మాన్ దూరమవడం కుటుంబంతో పాటు సమాజానికి తీరని లోటు అని రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనపాటి సాల్మాన్ మరణవార్త విన్న మరుసటి రోజునే మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి చక్రవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. తండ్రి మరణంతో విషన్నవదనంతో మాట్లాడిన చక్రవర్తిని ఆయన ఓదార్చారు. చక్రవర్తి కుటుంబానికి అన్ని విధాల మేకపాటి కుటుంబం అండగా ఉంటుందన్నారు.

———————

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.