
దేశంలో లో కరోన సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కొంత ఉపశమనం కలిగించే విషయం. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా అనుకుంటున్న సమయంలో మహారాష్ట్రలో మార్చి నెలలోని కేసులు విపరీతంగా పెరగడం వల్ల దేశం మొత్తం సెకండ్ వేవ్ మొదలైంది అని అర్థమైంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రోజువారి ఆరు లక్షల కేసులు నమోదు అవుతున్నా పరిస్థితుల నుంచి నేడు నాలుగు లక్షల కేసులు నమోదవుతున్న పరిస్థితుల్లోకి వచ్చిందంటే కాస్త తగ్గుముఖం పట్టిందని భావించాలి. అలానే రికవరీ రేటు కూడా రెట్టింపు స్థాయిలోనే ఉన్నది. చాలా రోజుల తర్వాత ఈరోజు వెయ్యి కేసులు లోపు నమోదు అవ్వడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇలానే మరికొన్ని రోజులపాటు కఠినమైన లాక్ డౌన్ అవలంబిస్తే దేశం మొత్తం కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.



Comments are closed.