
స్మార్ట్ పోలీసింగ్తో నేరాల నియంత్రణ దిశగా నెల్లూరు జిల్లా పోలీస్ అడుగులు
నెల్లూరు:
నేరాల నియంత్రణ, ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా నమోదైన గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, హత్యలు, POCSO & రేప్ కేసులు, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ నేరాలు, వాహనాల దొంగతనాలు, మిస్సింగ్ కేసులు, చీటింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174 Cr.P.C కేసులు, NDPS కేసులు తదితర అంశాలపై సర్కిల్ వారీగా సమీక్ష చేపట్టారు.
స్మార్ట్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి
స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ఆధునిక టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, సీసీటీవీ నిఘా, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్ఫారమ్లను సమర్థవంతంగా వినియోగించి నేరాలను ముందుగానే గుర్తించవచ్చని జిల్లా ఎస్.పి. తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
FRS టెక్నాలజీ వినియోగం

PPT ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన FRS (Face Recognition System) కెమెరాల ఉపయోగాలపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ టెక్నాలజీ ద్వారా మిస్సింగ్ కేసుల్లో తప్పిపోయిన వారిని గుర్తించడం, పాత నేరస్తుల కదలికలను గుర్తించి అలెర్ట్స్ ద్వారా వారిని పట్టుకోవడంలో FRS కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
కేసుల దర్యాప్తు, ప్రజా సేవలపై ఆదేశాలు
గ్రేవ్ కేసుల్లో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి చార్జ్షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
PGRS పిటిషన్లను తక్షణమే పరిష్కరించాలని, డయల్ 112 కాల్స్కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.
ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా కన్విక్షన్ రేటు పెరుగుతుందని తెలిపారు.

నేర నివారణ చర్యలు
ఓపెన్ డ్రింకింగ్ను నియంత్రించేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించి నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి మళ్లీ రిమాండ్కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి బ్లాక్ స్పాట్స్ను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
డ్రోన్ సర్వైలెన్స్, గస్తీ బలోపేతం
డ్రోన్ సర్వైలెన్స్ను విస్తృతంగా నిర్వహించాలని, ముఖ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ ఆపరేషన్లు, రాత్రి వేళ గస్తీలను ముమ్మరం చేయాలని, అనుమానితుల వేలిముద్రలు సేకరించాలని ఆదేశించారు.
మిస్సింగ్ కేసులు, విలేజ్ విజిట్స్
మిస్సింగ్ కేసులను త్వరితగతిన చేధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని, ప్రతి అధికారి తప్పనిసరిగా విలేజ్ విజిట్స్ నిర్వహించి ముందస్తు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.

ఉత్తమ పనికి ప్రశంసలు

జనవరి నెలలో గుడ్ వర్క్ చేసిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్.పి. ప్రశంసించి సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పి.(అడ్మిన్) CH. సౌజన్య, టౌన్ ASP దీక్ష, IPS, జిల్లా DSPలు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


