The South9
The news is by your side.

మన పాటి కుటుంబానికి ఆనం పరామర్శ.

post top

నెల్లూరు ప్రతినిధి ; ప్రముఖ న్యాయవాది ఆలిండియా లాయర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు, రంగస్థల నటులు, మనపాటి సాల్మన్ ఆకస్మిక మరణ వార్త తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి పెద్ద కుమారుడు, ఎసి సుబ్బారెడ్డి నెల్లూరు నగరంలోని మన పాటి సాల్మన్ గృహానికి విచ్చేసి వారి కుమారుడు సౌత్ 9 ఎడిటర్ మన పాటి చక్రవర్తి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భక్తవత్సల నగర్ లోని వారి గృహానికి విచ్చేసిన ఎసి సుబ్బారెడ్డి ముందుగా దివంగత మన పాటి సాల్మన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మన పాటి సాల్మన్ అన్న, మా కుటుంబానికి చాలా దగ్గరగా వ్యవహరించే వారని అన్నారు. ఆయన మరణవార్త చాలా బాధాకరం అని అన్నారు. తన చిన్నతనంలో మా ఇంటికి వచ్చేటప్పుడు హుందాగా వైట్ అండ్ వైట్ వేసుకోని టక్ చేసుకునే వచ్చేవారిని గుర్తు చేసుకున్నారు. కుమారుడు జర్నలిస్ట్ చక్రవర్తికి ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి ఆనం కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మన పాటి సోదరులు, మన పాటి విజయ్, మన పాటి అనిల్ , స్థానిక నాయకులు శివ,రంగారావు శ్రీనివాసులు రెడ్డి, గిరీష్, తదితరులు పాల్గొన్నారు.

 

after image

 

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.