
చెన్నై ప్రతినిధి: నిన్న ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పాలి. కొద్దిసేపు క్రితం ప్రముఖ నటుడుఆలిండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) పార్టీ అధ్యక్షులు శరత్ కుమార్ మరో ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో భేటీ అయ్యారు. మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఈ భేటీ రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. భేటీ అనంతరం శరత్ కుమార్ మాట్లాడుతూ… కమలహాసన్ కి చెందిన పార్టీ మక్కల్ నీదిమయ్యం (ఎంఎన్ఎం)తో పొత్తుకు ప్రతిపాదన చేశామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కమల్ తో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నామని , అదే విషయాన్ని కమల్ కి వివరించామని తెలిపారు. ఇక కమల్ హాసన్ ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయనకే వదిలేసాము అని అన్నారు. కమల్ తమ నిర్ణయాన్ని, స్వాగతఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఇదివరకే , ఇండియా జననాయగ కట్చి (ఐజేకే) పార్టీతో తమ పొత్తు ఖరారైందని శరత్ కుమార్ వెల్లడించారు.
శరత్ కుమార్ పార్టీ గతంలో లో అధిక పార్టీ అన్నాడీఎంకేతో మిత్రపక్షంగా గుర్తింపు పొందింది. శరత్ కుమార్ తాజా నిర్ణయంతో అధికార పక్షానికి దూరమవుతున్నారా, లేక కొత్త రాజకీయ వ్యూహమా అనేది వేచి చూడాల్సిందే.
Comments are closed.