
చెన్నై ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో డి.ఎం.కె అధినేత స్టాలిన్ 173 అభ్యర్థులు తో కూడిన జాబితాని విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా సినిమా యాక్టర్ స్టాలిన్ కుమారుడు కరుణానిధి మనవడు ఉదయనిది స్టాలిన్ మొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.

చెపాక్ స్థానంలో పోటీ చేస్తున్న ఉదయనిధి మరో వారసుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గతంలో ఈ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొందిన కరుణానిధి
తమిళనాడు రాజకీయాల్లో మరో వారసుడు గా ఎంట్రీ ఇచ్చాడు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. తన తాత, దివంగత కరుణానిధి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే స్థానంలో ఉదయనిధి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. స్టాలిన్ విషయానికి వస్తే ఎప్పటి మాదిరే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే యూత్ వింగ్ సెక్రటరీగా ఉన్నారు. మూడేళ్ల క్రితమే ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం తొలి నుంచి డీఎంకేకు కంచుకోటగా ఉంది. ఉదయనిధి ప్రస్తుతం ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి కరుణానిధి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు పోటీగా తంగా తమిళ్ సెల్వన్ ను ఆయన బరిలోకి దించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, మార్చి 15వ తేదీన నామినేషన్లు వేస్తామని చెప్పారు. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రతి డీఎంకే అభ్యర్థిని పార్టీ కార్యకర్తలందరూ కరుణానిధిగా భావించి, ఓటు వేయాలని కోరారు. ఎన్నో ఎన్నికల నుంచి ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి పీఠం ఈసారైనా స్టాలిన్ దక్కుతుందో లేదో వేచి చూడాలి.
Comments are closed.