The South9
The news is by your side.

కోర్టుల తీరుపై మేధావులు చర్చించాలి: స్పీకర్ తమ్మినేని

post top

చిత్తూరు: ప్రభుత్వ విధానాలలో కోర్టుల జోక్యం దారుణం అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

after image

ఇది ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ చొరబడడమేనని, ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు… ఎమ్మెల్యేలు కావడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కోర్టులే ఆపమని అంటుంటే… ఇక ఈ వ్యవస్థలు ఎందుకు అన్నారు. న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అని అడిగారు.

బాధతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నామని, మేధావులు దీనిపై చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు. మా నిర్ణయాలు తప్పైతే గెలిపించిన ప్రజలే మళ్లీ ఓడిస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నామని తమ్మినేని వ్యాఖ్యానించారు. మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు (మనీ బిల్లు)ను ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ట అన్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.