The South9
The news is by your side.

పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*

*: ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి*

*: కొత్తపల్లి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం*

*దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.*

 

*మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం కొత్తపల్లి సచివాలయం పరిధిలోని కొత్తపల్లి, వడ్డీపాళెం గ్రామాల్లో ఆయన ముమ్మరంగా పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డీపాళెంలో వెంకయ్యస్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.*

 

*అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలకు సంక్షేమ లబ్ది కరపత్రాలను అందచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి కుటుంబాల వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేసేందుకు అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు.*

 

after image

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 93 సచివాలయాల్లో 54వ సచివాలయంలో పర్యటించడం జరిగిందని, ప్రతి సచివాలయం పరిధిలో కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందచేశారని, అభివృద్ది పనుల కోసం సైతం కోట్లాద రూపాయలు అందించారని వివరించారు.*

 

Post midle

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అందచేస్తున్న ప్రతి సంక్షేమ పథకం ఆ ఇంటికి తప్పకుండా అందుతుందనే మేమంతా గర్వంగా చెప్పుకుంటున్నట్లు వివరించారు. దేశంలో ఇలా నేరుగా సంక్షేమపథకాలను అందించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.*

 

*ప్రతి ఒక్కరికి సంక్షేమం గురించి ఆలోచించి ముఖ్యమంత్రి అందచేసిన సంక్షేమ పథకాలను నేరుగా చూసి వారితో మాట్లాడడం జరిగిందని వివరించారు. నియోజకవర్గంలో గృహ నిర్మాణాలకు సంబంధించి 15 వేల గృహాల వరకు మంజూరయ్యాయని, త్వరలోనే నిర్మాణాలు ప్రారంభించి పూర్తి చేస్తామని వివరించారు.*

 

*రోడ్లు, డ్రైనేజీలు సమస్యలు ప్రజలు తెలుపుతున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విషయాన్ని తెలిపి వచ్చే మెనిఫెస్టోలో ఈ సమస్యలను చేర్చి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.*

 

*వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెనిఫెస్టోలో ఏదైనా అంశాన్ని పెడితే తప్పక చేస్తారని ప్రజలంతా విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ది పనులు కూడా తప్పకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.