The South9
The news is by your side.

మరలా తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

post top

తెలంగాణలో మరోసారి 200 దాటిన కరోనా కొత్త కేసుల సంఖ్య
గడచిన 24 గంటల్లో 247 మందికి పాజిటివ్
158 మందికి కరోనా నయం
అదే సమయంలో ముగ్గురి మృతి
యాక్టివ్ కేసుల సంఖ్య 2,101
తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. గత కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్య 200 దాటుతోంది. తాజాగా తెలంగాణలో 247 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 29 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో 158 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణలో తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,769కి పెరిగింది. వారిలో 2,98,009 మంది కోలుకున్నారు. ఇంకా 2,101 మందికి చికిత్స జరుగుతోంది.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.