
కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో మహారాష్ట్ర విలవిలలాడుతోంది. గత కొద్ది రోజులకు పైగా రోజూ పది వేల కేసులు నమోదు అవడంతో ప్రభుత్వం మరలా లాక్డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్ వెల్లడించారు . ఈ నేపథ్యంలో లో ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తుంది. రణబీర్ తో పాటు ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా బన్సాలీ కి కూడా కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ కొత్త సినిమా గంగు భాయ్ కఠియా వాడి లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నటి అలియా భట్ ముందు జాగ్రత్తతో క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్ర వ్యాప్తంగా కేసుల సంఖ్య దాదాపు 22 లక్షలు పైగా దాటేశాయి. ముంబై తో పాటు నాసిక్, పూణే ,నాగపూర్, ఔరంగాబాద్ నగరాల్లో కర్ఫ్యూ తో పాటు లాక్ డౌన్ ని పటిష్టంగా అమలు చేస్తున్నారు.
Comments are closed.