The South9
The news is by your side.

సంక్షేమ పథకాలతో ఆర్థిక ప్రగతి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

post top

*సంక్షేమ పథకాలతో ఆర్థిక ప్రగతి : ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి*
*: తరుణవాయి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి అందచేస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పురోగాభివృద్ది సాధిస్తున్నారని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.*

*సోమవారం సంగం మండలం తరుణవాయి సచివాలయం పరిధిలోని ఉడ్ హౌస్ పేట, చెన్నవరప్పాడు గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చేసిన శాసనసభ్యులు విక్రమ్ రెడ్డికి ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.*

*ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి అందచేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సంక్షేమ లబ్ది కరపత్రాలను అందచేస్తూ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని లబ్దిదారులను ప్రశ్నిస్తూ ముందుకు సాగారు.*

after image

*ఈ సందర్భంగా పలువురు ఆయన దృష్టి పలు సమస్యలను తీసుకురావడంతో వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చూస్తానని వారికి తెలిపారు.*

*అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.*

*ఇప్పటికే నిర్వహించిన సర్వేలోని సమస్యలను అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరిస్తున్నారని, అభివృద్ది పనుల విషయమై సచివాలయానికి ప్రభుత్వం మంజూరు చేసి నిధుల ద్వారా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఉన్న పనులకు వెంటనే నిధులు మంజూరు చేస్తానని తెలిపారని, ప్రజలకు అవసరమైన పనులను గుర్తించాలని అధికారులకు సూచించారు.*

Post midle

*సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారి సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తీసుకురావాలని, తద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించవచ్చునని సూచించారు.*

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.