The South9
The news is by your side.

మేకపాటి ‘పెద్ద మనసు’ వరద బాధితులకు రూ. 50 లక్షలు విరాళం.

post top

సౌత్ 9 ప్రతినిధి :

నెల్లూరు

 

*మేకపాటి ‘పెద్ద మనసు’*

*: వరద బాధితులకు రూ. 50 లక్షలు విరాళం*

నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు తన పెద్ద మనసును చాటుకున్నారు.

after image

భారీ వర్షాలతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సహాయర్ధం రూ. 50 లక్షలు అందచేస్తున్నట్లు ప్రకటించారు.

 

నెల్లూరు జిల్లా వైస్సార్సీపీ పార్టీ కార్యాలయం లో జరిగిన మీడియా సమావేశంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ సహాయాన్ని ప్రకటించడం జరిగింది.

 

Post midle

ఆంధ్రప్రదేశ్ కు రూ.25 లక్షలు, తెలంగాణ రాష్ట్రానికి రూ.25 లక్షల వంతున మొత్తం రూ.50 లక్షలు ప్రకటించారు.

 

వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రతి ఒక్కరు ఉదారంగా ఆదుకోవాలని, తమ వంతుగా ఈ మొత్తాన్ని అందచేస్తున్నట్టు తెలిపారు.

 

వరదలతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రకృతి ప్రకోపానికి ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు వైస్సార్సీపీ శ్రేణులు, అందరు సమిష్టి కృషి చేద్దామని పేర్కొన్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.