The South9
The news is by your side.

తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 11 మంది మృతి

post top

తిరుపతి ప్రతినిధి:  తిరుపతి  రుయా హాస్పిటల్ నందు గల ఐసియు వార్డులో కోవేట్ చికిత్సపొందుతున్న 11 మంది పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. 8:30 గంటలకి ఆక్సిజన్ ప్రెజర్ అందక 11 మంది చనిపోయినట్లు తిరుపతి కలెక్టర్ హరి నారాయణన్
తెలిపారు. తమిళనాడు లోని పెరంబూరు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సమయానికి. రానందువలన ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే వెంటనే ఆక్సిజన్ని పునరుద్ధరించామని, దానివలన చాలా ప్రాణ హాని జరగకుండా చూశామని కలెక్టర్ అన్నారు . ప్రస్తుతం 700మంది ఆక్సిజన్ పడకల పై వైద్యం జరుగుతుందని, 30 మంది వైద్యులు అందుబాటులోనే ఉన్నారని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీసినట్లు దీనికి సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోగుల పరిస్థితి నిలకడగా ఉందని, అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని తిరుపతి కలెక్టర్ అన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.