The South9
The news is by your side.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్

post top

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. .తెలంగాణ రాష్ట్ర సమితి కి చెందిన అధికారిక టీ న్యూస్ ఛానల్ లో ప్రముఖంగా ఈ వార్తని ప్రసారం చేయడం జరిగింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని , క్వారంటైన్ లో, ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందువలన ఉన్నందువలన తెలంగాణ గవర్నమెంట్ నైట్ కర్ఫ్యూ ఆలోచన దిశగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది గంటల్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.