తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బలపరిచిన అభ్యర్థి మన పాటి చక్రవర్తి సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం లోని బ్రహ్మ దేవి ,పంటపాలెం, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనందరికీ ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రుణం తీర్చుకునే అవకాశం ఈ ఎన్నికల్లో కలిగిందని, మిషన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్ .కె మాబు మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి
మన పాటి చక్రవర్తి ని
ఆశీర్వదించాలని , మిషన్ గుర్తుపై మీ ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో లో బి రవి, బాబా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



Comments are closed.