చిరంజీవికి కరోనా అని తెలియడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. ఎందుకంటే చిరంజీవి ఇటీవలే సహనటుడు నాగార్జునతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి వరద సాయం చెక్కులు అందించారు. అది జరిగిన కొన్నిరోజులకే చిరూకు కరోనా పాజిటివ్ అని తేలడంతో సీఎంవో అధికారులు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ను చిరు, నాగ్ లు కలిసిప్పుడు అక్కడే ఉన్న ఎంపీ సంతోష్ కూడా తాజాగా కరోనా టెస్టు చేయించుకున్నారు. ఆయనకు నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది.

కాగా, సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంలో చిరంజీవి, నాగార్జున మాస్కులు ధరించకపోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Comments are closed.