The South9
The news is by your side.

వైయస్సార్‌సీపీ ఎంపీలతో సీఎం  వైయస్‌.జగన్‌ సమావేశం

post top

*అమరావతి*

*వైయస్సార్‌సీపీ ఎంపీలతో సీఎం  వైయస్‌.జగన్‌ సమావేశం*
*పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భేటీ*
*పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ*
*ఆయా అంశాలపై వాస్తవ స్థితిగతులను ఎంపీలకు వివరించిన సీఎం*
*పోలవరం సహా పలు కీలక అంశాలను లేవనెత్తాలన్న ముఖ్యమంత్రి*

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సమావేశం

పోలవరం సహా పలు కీలక అంశాలపై వాస్తవ సరిస్థితులను ఎంపీలకు వివరించిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌

పెండింగ్‌లో ఉన్న …. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రావాల్సిన బకాయిలు రూ. రూ.1569.86 కోట్లు, అలాగే ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదం రావాల్సి ఉందని ఎంపీలకు సీఎం వెల్లడి
రాష్ట్రానికి ప్యాకేజీ పేరిట గతంలో చంద్రబాబు ఒప్పుకున్న కారణంగా ప్రాజెక్టు వ్యయం ఖరారులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు దారితీశాయని.. ఎంపీలకు వివరించిన సీఎం

రాష్ట్ర ప్రభుత్వం వివిధ వేదికలపై చేసిన వాదనల వల్ల ప్రాజెక్టు వ్యయం ఖరారులో సానుకూల పరిస్థితి ఉందని, అంచనా వ్యయాన్ని ఖరారు చేయాల్సిందిగా కేంద్ర జలశక్తిమీద ఒత్తిడి తీసుకువస్తున్నామని వెల్లడించిన సీఎం
దీనిపై ప్రధానమంత్రి, హోంమంత్రికి రాసిన లేఖల్లోని అంశాలను వివరించిన ముఖ్యమంత్రి
పోలవరం ప్రాజెక్టు అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌ ఆమోదానికి గట్టిగా కృషిచేయాలని ఎంపీలను ఆదేశించిన సీఎం
ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా లేవనెత్తాలని, పోలవరం ప్రాజెక్టు పనులు సకాలానికి పూర్తిచేయడం చాలా ముఖ్యమైన అంశమన్న సీఎం

Post midle

ప్రత్యేక హోదాకోసం పలుమార్లు లేఖలు రాశామని, ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలో కూడా దీనిపై కేంద్రానికి విజ్ఞప్తిచేస్తున్నామని, పార్లమెంటు వేదికగా దీనిపై గళం వినిపించాలన్న ముఖ్యమంత్రి

16 కొత్త మెడికల్‌కాలేజీలను కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇప్పటికే 3 మెడికల్‌కాలేజీలకు అనుమతులు వచ్చాయని, మిగిలిన 13 కాలేజీలకు రావాల్సి ఉందని ఎంపీలకు వివరించిన సీఎం
రాష్ట్రానికి టైర్‌–1 సిటీ లేదని, దీనివల్ల ఆస్పత్రులు, మౌలిక సదుపాయాల కొరత ఉందన్న సీఎం
ఈ కొత్త వైద్యకళాశాలల కారణంగా సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారన్న సీఎం
అనుమతులు వచ్చేలోగా అన్నిరకాలుగా కాలేజీలు పెట్టేందుకు అడుగులు ముందుకేస్తున్నామన్న సీఎం

ప్రజాపంపిణీ వ్యవస్థకు ధాన్యం సేకరణ రూపేణా కేంద్రం రూ. 4,282 కోట్ల రూపాయలు బకాయిలు పడిందని, వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరామని తెలిపిన సీఎం

after image

14వ, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.1842.45 కోట్లు
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను రాబట్టే అంశంపై పార్లమెంటులో ప్రస్తావించాలన్న సీఎం

నివర్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ, తాత్కాలిక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద రూ. రూ. 2,255.7 కోట్లు రావాల్సి ఉందన్న సీఎం

కుడిగి, వల్లూరు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులనుంచి అధిక ధరకు కొన్న ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్నికోరామని ఎంపీలకు తెలిపిన సీఎం
దీనివల్ల ఫిక్స్‌డ్‌ఛార్జీల రూపేణా ఏడాదికి రూ.325 కోట్లు ఆదా అవుతాయన్న సీఎం
అధిక ధరకు ఇదివరలో చేసిన కొనుగోలు ఒప్పందాలను సరెండర్‌ చేయడం ద్వారా ఇప్పటికే రూ.800 కోట్లు ఆదా అయ్యిందని ఎంపీలకు తెలిపిన సీఎం
తక్కువ ధరకు విద్యుత్‌పై యుద్ధ ప్రాతిపదికన దృష్టిపెట్టామన్న సీఎం
త్వరలో రూ.10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌కు టెండర్లు పిలుస్తున్నామన్న సీఎం
రైతులకు శాశ్వత ప్రాతిపదికిన ఉచిత విద్యుత్‌ అందించడంలో భాగంగా ఈ చర్యలుచేపట్టామన్న సీఎం

ఏపీ దిశా బిల్లు, ఏపీ స్పెషల్‌ కోర్టుల బిల్లుల ఆమోదానికి కృషిచేయాలన్న సీఎం

రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బిల్లులను ఆమోదించామని, హైకోర్టును కర్నూలు పెట్టేందుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలంటూ కేంద్రాన్ని కోరామని తెలిపిన సీఎం.
ఈ అంశాన్ని బీజేపీకూడా మేనిఫెస్టోలో పెట్టింది.
ఈ అంశాన్ని పార్లమెంటు వేదికపై వినిపించాలని ఎంపీలకు సీఎం ఆదేశం.

ఉపాధి హామీ కింద రూ. 3,707.77 కోట్లు బకాయిలు ఉన్నాయని, అలాగే పనిదినాలను 100 నంచి 150కి పెంచాలంటూ విజ్ఞప్తిచేశామని ఈ రెండు అంశాలమీద పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో దృష్టిపెట్టాలని కోరిన సీఎం.

ట్రైబల్‌ యూనివర్శిటీని సాలూరులో త్వరగా పెట్టాలని, రెవిన్యూ లోటు కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 18,830.87 కోట్లు వచ్చేలా పార్లమెంటులో లేవనెత్తాలన్న సీఎం
అలాగే వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన రూ. 700 కోట్లు బకాయిల విడుదలకూ కృషిచేయాలన్న సీఎం

అలాగే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులపైనా పూర్తి వివరాలతో సిద్ధంకావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.
అబార్షన్‌ బిల్లుపై సమగ్రవివరాలతో సిద్ధంకావాలని వృత్తిరీత్యా వైద్యుడైన కర్నూలు ఎంపీ సంజయ్‌కు సీఎం ఆదేశాలు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపైకూడా సమావేశంలో చర్చ.
కచ్చితంగా రైతులకు కనీస మద్దతు ధర లభించాల్సిందేనన్న ముఖ్యమంత్రి.
ఎక్కడ కొనుగోళ్లు జరిగినా, కనీస మద్దతు ధర తగ్గకుండా కొనుగోళ్లు జరగాలన్న సీఎం.
ఎవరు కొనుగోలుచేసినా కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేయకూడదన్న సీఎం
ఇదే షరతుతో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చామన్న ముఖ్యమంత్రి
కొత్త వ్యవసాయచట్టాల విషయంలో ఈ షరతుకు మనం కట్టుబడి ఉన్నామనే విషయాన్ని పునరుద్ఘాటించాలన్న సీఎం

దేవాలయాల్లో జరిగిన ఘటనల అంశపై సమగ్ర వివరాలతో సిద్ధంకావాలని ఎంపీలకు సీఎం ఆదేశం.
ఈ కేసుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఉన్నట్టుగా విచారణలో తేలిందన్న సీఎం.
దురుద్దేశ పూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని,ఏ మతానికి చెందినవారు తప్పులు చేసినా చర్యలు కఠినంగా తీసుకుంటున్నామన్న ముఖ్యమంత్రి
దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం.. సహా వివిధ ఘటనలపై సమగ్ర వివరాలను తెలుసుకుని, ఆమేరకు సిద్ధం కావాలన్న సీఎం
శ్రీకాకుళం జిల్లాలో నంది విగ్రహాన్ని టీడీపీ వ్యక్తులు తొలగించారని,
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇది జరిగిందని, ఈ ఘటనకు బాధ్యులు వైయస్సార్‌సీపీ వాళ్లేనంటూ మొదట ప్రచారం చేశారన్న సీఎం.
ఈనాడు విలేఖరి కూడా ఈ కేసులో భాగస్వామిగా ఉన్నారన్న విషయాన్ని దర్యాప్తులో వెల్లడైందన్న సీఎం
సీసీ కెమెరా విజువల్స్‌ బయటపడిన తర్వాత చంద్రబాబునాయుడు తన వాదనను మార్చారన్న ముఖ్యమంత్రి.
వైయస్సార్‌గారి విగ్రహాన్ని పెడుతున్నారు కాబట్టి.. నంది విగ్రహం పెట్టడం తప్పు ఎలా అవుతుంది అంటూ చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారన్న సీఎం.
ఒకరి విగ్రహాలను అడ్డుకోవడానికి ఆలయాల్లోని విగ్రహాలను తొలగించి పెడతారా? అన్న సీఎం
దీనిపై వివరాలు, సాక్ష్యాధారాలు తీసుకుని సిద్ధంగా ఉండాలని ఎంపీలకు సీఎం ఆదేశం.
మతం అనేది నాలుగు గోడల మధ్య దేవుడికి, మనిషికి మధ్య ఉన్న అనుబంధం అన్న సీఎం.
ఆ గది బయటకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి, సాటి మనిషికి గౌరవం ఇవ్వాలని, మానవత్వం అంటే ఇదేనన్న సీఎం
దీనినుంచి పక్కకు వెళ్తే… సమాజంలో అశాంతి మొదలవుతుందన్న ముఖ్యమంత్రి
అంతర్వేది రథం దగ్ధంపై సీబీఐ విచారణ కోరిన అంశాన్ని ఎంపీలకు తెలిపిన అధికారులు
ఇదికూడా పెండింగులో ఉందని తెలిపిన సీఎం
వైజాగ్‌ రైల్వే జోన్‌ ప్రకటించినప్పటికీ డివిజన్లపై నెలకొన్న సమస్యలను ప్రస్తావించాలన్న సీఎం

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.