The South9
The news is by your side.

వైయస్సార్సీపి పై రిపబ్లిక్ టీవీ సంచలన కథనం.

post top

జాతీయ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ సోమవారం సాయంత్రం అధికార పార్టీ వై ఎస్ ఆర్ సి పి మీద ఒక కథనాన్ని ప్రసారం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా పార్టీలో ఒక గ్రూప్ తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైందని దానికి ఒక సీనియర్ కీలక నేత నేతృత్వం వహిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. వీరికి మద్దతుగా మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఆ గ్రూపు లో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆందోళన చెంది ఎలాగైనా పరిస్థితిని అదుపు చేయాలని, అత్యవసరంగా కోర్ కమిటీ సమావేశం కి పిలుపునిచ్చినట్లు రిపబ్లిక్ టీవీ ఆ కథనంలో పేర్కొంది. ‌ ‌ ‌ ‌ ‌                                                                                                                                     చట్టపరమైన చర్యలు తప్పవు______             సజ్జల రామకృష్ణారెడ్డి                                             మున్సిపల్ ఎన్నికల సమయంలో లో రిపబ్లిక్ టీవీ ఇలాంటి అసత్య కథనాలను ప్రసారం చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఛానల్ అధినేత అర్నబ్ గోస్వామి గురువు చంద్రబాబు అని ఈ వార్తా కథనం వెనుక చంద్రబాబు హస్తం ఉండవచ్చునని సందేహం వ్యక్తం చేశారు. ఇటువంటి అసత్య ఆరోపణల ను కొట్టి వేయకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే తాము ఈ స్పష్టత ఇచ్చామని తెలిపారు. రిపబ్లిక్ టీవీ పై కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.