The South9
The news is by your side.
after image

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నా రేవంత్ రెడ్డి!

post top

తెలంగాణ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దూకుడును పెంచుతున్నారు. టి పి సి సి పదవి పొందిన వెంటనే , మీడియా అధిపతి లైన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ, లను మర్యాదపూర్వకంగా కలిసి మీడియా పరంగా తనకు సపోర్ట్ చేయాలని అడిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న రేవంత్ మరికొద్ది సేపట్లో మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ ని కలవనున్నారు. దేవేందర్ గౌడ్ కుమారులైన వీరేందర్, విజయేంద్ర గౌడ్ లను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని సమాచారం. రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా రేవంత్ రెడ్డి వెంట వెళ్లనున్నారు. రేవంత్ పదవి చేపట్టిన నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ పాత నాయకులు కలుపుకోవడం, పార్టీలోకి ఆహ్వానించి విషయాల పై దృష్టి పెట్టారు రేవంత్.

Post midle

Comments are closed.