
నెల్లూరు ప్రతినిధి : కరోనా కష్టకాలంలో ఒక్కొక్కరిదీ ఒక్కొక్క వ్యధ. పేద ప్రజలు ప్రాణం నిలబెట్టుకోవాలని తమ శక్తికి మించి అప్పోసప్పో చేసి ఉన్న భూమి ని అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్ కి వైద్యం కొరకు వెళితే ప్రాణాలు నిలబడటం కాదు కదా లక్షలు లక్షలు గుంజి శవాలను చేతికి ఇస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తిరిగి బెదిరింపులు కేసులు ఎదుర్కొనే పరిస్థితి నెల్లూరు నగరంలో ఉందంటే అతిశయోక్తి కాదు.అన్ని హాస్పిటల్స్ ఇలానే వ్యవహరిస్తున్నాయని మేము అనడం లేదు. కొన్ని హాస్పిటల్స్ లో మాత్రం కచ్చితంగా ఇలాంటి పరిస్థితేఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల క్రితం నెల్లూరు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ “కిమ్స్” నందు కరోనా వైద్యం కొరకు చేరిన పేషెంట్ తాలూకా బంధువు నుంచి ఐదు లక్షల 50,000 ఫీజు వసూలు చేసి చేతికి శవాన్ని ఇచ్చిన సంఘటన మరువకముందే మరొక ఘటన చోటు చేసుకుంది. . నెల్లూరు నగరంలోని ఇంకో ప్రముఖ హాస్పిటల్ ఎయిమ్స్ లో తోటపల్లిగూడూరు మండలం చినతోపు గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్న లేబూరు మల్లికార్జున సతీమణి లేబర్ స్వర్ణలత ను ఈనెల 13న కరోనా చికిత్స కోసం ఎయిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అయితే చికిత్స సరిగా ఇవ్వడం లేదని రాత్రుల్లో ఆక్సిజన్ సరఫరా నిలిపివేస్తున్నారు అని బాధితురాలు తన బంధువులకు సమాచారం అందించడంతో , బంధువులు హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించగా అదేమీ లేదని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం పేషెంట్ పరిస్థితి బాగాలేదని వచ్చి తీసుకెళ్ళమని హాస్పిటల్ సిబ్బంది బంధువులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన బంధువులు హాస్పిటల్ కి వచ్చి చూడగా ఆక్సిజన్ తీసివేసి ఉందని మీటర్ 40 చూపిస్తుందని హాస్పిటల్ సిబ్బంది ని గట్టిగా ప్రశ్నించగా అప్పుడు ఆక్సిజన్ అందించారని బంధువులు తెలియజేశారు. దీనిపై జిల్లా నోడల్ అధికారి కి ఫిర్యాదు చేయగా ఆయన హాస్పిటల్ ను సందర్శించి అంతా సవ్యంగా ఉందని ఆస్పత్రి వర్గాల కి కితాబులు ఇవ్వడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో సదరు బాధితురాలు బుధవారం మృతి చెందగా బంధువులు ఆగ్రహానికి గురై హాస్పిటల్ నందు ధర్నా నిర్వహించారు. కాగా తమ సోదరి స్వర్ణలత హాస్పిటల్ నిర్లక్ష్య వైఖరి కారణంగా చనిపోయిందని ఒకటో నగర పోలీస్ స్టేషన్ లో ఆమె సోదరుడు శ్రీనివాస్ రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ వర్గాలు రాజీ చేసుకోమన్నారు అని, ఇంకొకరికి ఇలా జరగకుండా ఉండాలని తను రాజకీయ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా నెల్లూరు కార్పొరేట్ హాస్పిటల్స్ పై నిఘా పెట్టాల్సిన నోడల్ అధికారులు అంతా సవ్యంగా ఉందని రిపోర్టులు ఇస్తుంటే వారు ఇంకెవరికీ భయపడతారని ప్రజలు అంటున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం.
Comments are closed.