చెన్నై ప్రతినిధి : ప్రముఖ తమిళ హీరో విజయ్ మరలా హైకోర్టు ను ఆశ్రయించడంతో వార్తల్లో కెక్కారు. కొంతకాలం క్రితం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయల్స్ కార్ సంబంధించిన అడ్వాన్స్ టాక్స్ విషయంలో విజయ్ మీద వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టును ఆశ్రయించగా ఈ మధ్యనే లక్ష రూపాయలు కరోనా సీఎం రిలీఫ్ ఫండ్ కి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి హీరో విజయ్ మీద హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్షల మంది అభిమానులు కలిగిన హీరో వారి మనోభావాలను గౌరవించాలని, వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. పన్ను ఎగవేత ను సమర్ధించ లేమని అన్నారు. సినిమాలో మాత్రం సూపర్ హీరోల కనిపిస్తారని, సామాజిక న్యాయం కోసం పోరాడే పాత్రల్లో నటిస్తారని చురకలంటించారు. ఈ నేపథ్యంలో మరలా విజయ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మరొక హైకోర్ట్ బెంచ్ ని ఆశ్రయించడం జరిగింది. హీరో విజయ్ వేసిన పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దొరైస్వామి, జస్టిస్ హేమలత స్వీకరించారు. ఈ మధ్య హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని జత చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ ని ఆదేశించారు. మరి రెండు మూడు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు తెలియజేశారు. లక్ష రూపాయలు జరిమానా ని సీఎం రిలీఫ్ ఫండ్ కి కట్టకుండా మరలా హీరో విజయ్ హైకోర్టును ఆశ్రయించడం పై హీరో అభిమానులు అసహనానికి లోనే ఏంటి విజయ్ ఇది అని అనుకుంటున్నారు అని తెలుస్తోంది.
Comments are closed.