The South9
The news is by your side.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇద్దరు ఖైదీలు మృతి

post top

తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ(26) అనే జీవిత ఖైదీ అనారోగ్యంతో కుప్పకూలాడు. దీంతో అతన్ని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

after image

కాగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. బాలాజీ రాజమండ్రి జైలులో 2014 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. మరో రిమాండ్ ఖైదీ నాగులు(31) అనే వ్యక్తిని అనారోగ్యంగా ఉన్నాడని జూన్ 29న జైల్ అధికారులు ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.