The South9
The news is by your side.
after image

నాటు బాంబు పేలి ఆవు మృతి

post top

చిత్తూరు: జిల్లాలోని కొగిలేరులో అడవిపందుల కోసం పెట్టిన నాటుబాంబు పేలడంలో మూడు రోజుల క్రితం ఓ ఆవు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.. కాగా ఆ ఆవు మూడు రోజులుగా తీవ్ర నరకయాతన అనుభవిస్తూ.. మృతి చెందింది.

Post Inner vinod found

పంటలను నాశనం చేస్తున్న అడవిపందులను ఎదుర్కొనేందుకు పైనాపిల్ పండ్లలో నాటు బాంబులు పెట్టినట్టు తెలుస్తోంది. ఆవు పైనాపిల్ ను తినేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా బాంబు పేలి కింది దవడ, నాలుకకు తీవ్ర గాయాలైనాయి. ఈ నేపథ్యంలో నీరు ఆహారం తీసుకోకపోవడంతో మృతి చెందింది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను, నాటు బాంబులు తయారు చేసిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post midle

Comments are closed.