The South9
The news is by your side.

మృతుల సంఖ్య 6కి పెరిగింది

post top

తమిళనాడు: కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్ స్టేషన్లో జరిగిన భారీ ప్రమాదంలో మృతుల సంఖ్య 6 కు చేరుకున్నది.

after image

ఎన్ఎల్సీ యూనిట్-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మందికి గాయాలయ్యాయి. తొలుత నలుగురు మాత్రమే చనిపోయారని వార్తలొచ్చాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
గత మే నెలలోనూ టన్నెల్లోని 6వ యూనిట్లో బాయిలర్ పేలింది. నాటి ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.